యాప్నగరం

విశాఖ: వివాహ వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా.. గొప్ప నిర్ణయం, ఈ జంటకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Nidadavolu Couple Pledge To Donate Organs వివాహ వేడుక రోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కొత్త జంట. ఈ నెల 29న వివాహ బంధంతో ఒక్కటికాబోతున్న జంట. అదే రోజు మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఏకంగా 60మందితో కలిసి అవయవదానం చేయబోతున్నారు. అందరూ అంగీకార పత్రాన్ని విశాఖ సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌‌కు అందజేయనున్నారు. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న జంటను అందరూ అభినందిస్తున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 27 Dec 2022, 10:55 am

ప్రధానాంశాలు:

  • నిడదవోలులో జంట వినూత్న నిర్ణయం
  • వివాహం చేసకునే రోజు గొప్ప కార్యక్రమం
  • కాబోయే దంపతులకు హ్యాట్సాఫ్ చెప్పాలి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nidadavolu Couple Organ Donation
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను కొందరు ఘనంగా, మరికొందరు వినూత్నంగా జరుపుకుంటారు. కానీ ఓ జంట మాత్రం తమ జీవితంలో గుర్తిండిపోయేలా పెళ్లి వేడుక చేసుకోవాల నిర్ణయం తీసుకున్నారు. తమ వివాహ వేడుక సాక్షిగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని వేలివెన్నుకు చెందిన సతీష్ కుమార్‌, సజీవరాణిల పెళ్లికి ఈనెల 29న నిడదవోలులో ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అయితే సతీష్ తాను వివాహం చేసుకునే రోజునే తనతో పాటు తన బంధువులు, స్నేహితులతో కలిసి అవయవదాన హామీ పత్రాలు సమర్పించాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాబోయే భర్త ఆలోచనకు తోడుగా వధువు సజీవరాణి కూడా అవయవదాన హామీ పత్రం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

విశాఖ సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ గూడూరు సీతామహాలక్ష్మి వీరి నుంచి హామీ పత్రాలను స్వీకరిస్తారు. వివాహ వేడుక సందర్భంగా ఏదైనా ఒక మంచి పనికి నాంది పలకాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట చెప్పిన వెంటనే బంధువులు, స్నేహితులు కూడా మద్దతు ఇచ్చారు. దాదాపు 60 మంది వరకు అవయవదాన హామీ పత్రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

అంతేకాదు వివాహ ఆహ్వాన పత్రికలో కూడా అవయవ దానం చేయండి- ప్రాణదాతలు కండి అంటూ పిలుపునిచ్చారు. అందరికీ అవయవదాన ఆవశ్యకతను ప్రచారం చేశారు. దీంతో సతీష్ కుమార్, సజీవరాణిల వినూత్న ఆలోచనతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఒకవే మనం చనిపోయినా.. అవయవదానం చేస్తే మరికొందరు ప్రాణాలు నిలబడే అవకాశం ఉంటుందనే ఈ ఆలోచన చేశామంటున్నారు. విల్లింగ్‌ టు హెల్ప్‌ ఫౌండేషన్‌ సాయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాని తెలిపారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.