యాప్నగరం

తూర్పు గోదావరిలో అమానుష ఘటన.. దళిత యువకుడిని కొట్టి.. దారుణం

కులోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. దళిత యువకుడిపై దాడికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై దారుణంగా కొట్టి కాళ్లు పట్టించుకున్నారు.

Samayam Telugu 3 Jan 2021, 5:52 pm
తూర్పు గోదావరి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అగ్రకులహంకారం మరోసారి జడలు విప్పింది. దళిత యువకుడిపై దాడి చేసిన కొందరు యువకులు తమ కాళ్లు పట్టించుకున్న దారుణ ఘటన కాకినాడలో వెలుగుచూసింది. ఇంద్రపాలేనికి చెందిన దళిత యువకుడి ఇంటి వద్దకు వచ్చి వేధింపులకు గురిచేయడమే కాకుండా అతన్ని సెంటర్‌కి తీసుకెళ్లి దారుణంగా ప్రవర్తించారు. ఇంద్రపాలెం నుంచి కచ్చేరి సెంటర్‌కి తీసుకెళ్లి అనుదీప్ కృష్ణ అనే యువకుడిని అవమానించారు. సెంటర్‌లో తమ కాళ్లపై పడి క్షమాపణ చెప్పించుకోవడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియోలు తీసి రాక్షసానందం పొందారు. అగ్రకుల దురహంకారంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
humiliation


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.