తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం కందుకూరు గ్రామానికి చెందిన గొల్లపల్లి ఉదయశ్రీ అనే బాలిక కంట్లో మురుగు పడింది. కన్ను మంటగా ఉండటంతో స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పీహెచ్సీలో డాక్టర్, నర్సు అందుబాటులో లేకపోవడంతో.. అటెండర్ సిరంజీతో పాప కంట్లోకి నీరు చిమ్మి క్లీన్ చేసే ప్రయత్నం చేశాడు.
కానీ ఊహించని రీతిలో సిరంజీ బాలిక కంట్లో గుచ్చుకుంది. దీంతో ఆమె కంటి చూపును కోల్పోయింది. చిన్న చికిత్స కోసం వస్తే కూతురి కంటి చూపు పోగొట్టారనే వేదనతో.. ఆ చిన్నారి తండ్రి నాటి కలెక్టర్తోపాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన 2015 జనవరి 23వ తేదీన జరిగింది. అప్పటికి బాలిక 8వ తరగతి చదివేది. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో డీహెచ్ఎంవోగా పని చేసిన సావిత్రమ్మతోపాటు డాక్టర్ దుర్గా ప్రసాద్, మరో నలుగురు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. శాఖపరమైన విచారణ చేపట్టి నివేదిక ఇచ్చారు. గతేడాది జనవరి 30న ఏపీ సర్కారు ఈ ఆరుగురిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశించిన ఏడాది తర్వాత డాక్టర్ సావిత్రి విచారణ చేపట్టారు. రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తానని తెలిపారు.
కానీ ఊహించని రీతిలో సిరంజీ బాలిక కంట్లో గుచ్చుకుంది. దీంతో ఆమె కంటి చూపును కోల్పోయింది. చిన్న చికిత్స కోసం వస్తే కూతురి కంటి చూపు పోగొట్టారనే వేదనతో.. ఆ చిన్నారి తండ్రి నాటి కలెక్టర్తోపాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన 2015 జనవరి 23వ తేదీన జరిగింది. అప్పటికి బాలిక 8వ తరగతి చదివేది. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో డీహెచ్ఎంవోగా పని చేసిన సావిత్రమ్మతోపాటు డాక్టర్ దుర్గా ప్రసాద్, మరో నలుగురు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. శాఖపరమైన విచారణ చేపట్టి నివేదిక ఇచ్చారు. గతేడాది జనవరి 30న ఏపీ సర్కారు ఈ ఆరుగురిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశించిన ఏడాది తర్వాత డాక్టర్ సావిత్రి విచారణ చేపట్టారు. రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తానని తెలిపారు.