యాప్నగరం

ఉత్తమ గ్రామ వాలంటీర్‌గా అవార్డు అందుకోవాల్సిన టైంలో.. విషాదం!

తూర్పు గోదావరి జిల్లాలో ఉత్తమ గ్రామ వాలంటీర్‌గా అవార్డు పొందిన వ్యక్తి చివరికి విషాదకరరీతిలో..!

Samayam Telugu 19 Mar 2021, 11:02 pm
ఉగాది పర్వదినం నాడు ఉత్తమ వాలంటీర్‌గా పురస్కారం అందుకోవాల్సిన వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గోడి గ్రామానికి చెందిన నరసింహం (30) గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. తన మూడేళ్ల కూతురు, సమీప బంధువు యార్లగడ్డ దుర్గారావుతో కలిసి మురమళ్లలో గురువారం నిశ్చితార్థానికి వెళ్లారు. తిరిగి బైక్‌పై వస్తుండగా అమలాపురం నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహం తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Samayam Telugu రోడ్డు ప్రమాదంలో మరణించిన వాలంటీర్ నరసింహం


దుర్గారావు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వారి మధ్యలో కూర్చోబెట్టుకున్న పాపను దుర్గారావు పక్కకు విసిరేయడంతో సురక్షితంగా బయటపడింది. కాగా, గ్రామ వాలంటీర్‌గా నరసింహం సేవలకు మెచ్చిన గ్రామస్తులు ఆయన భార్య దుర్గా భవానిని ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా వార్డు సభ్యురాలిగా ఎన్నుకున్నారు.

గ్రామంలో ఇలాంటి మంచి పేరు తెచ్చుకున్న వాలంటీర్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నరసింహంకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముమ్మిడివరం ఎస్‌ఐ కేవీ నాగార్జున ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.