తూ.గో: ఏసుక్రీస్తు బోధనలు చెప్పడానికి బయల్దేరిన పాస్టర్.. అంతలోనే, విషాదం!
తూర్పు గోదావరి జిల్లా రావుపాడులో క్రైస్తవ బోధనలు చేసేందుకు బయల్దేరిన పాస్టర్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
Samayam Telugu 12 Apr 2021, 7:36 pm
ఏసుక్రీస్తు బోధనలు వివరించేందుకు, ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్న పాస్టర్ను ఓ కారు మృత్యువులా వెంటాడింది. కారు బలంగా ఢీకొట్టడంతో పాస్టర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా రావులపాడుకు చెందిన పాస్టర్ వీటి వరప్రసాద్ (40) మండల పరిధిలోని గోపాలపురం, పొడగట్లపల్లి శివారు లక్ష్మీపాలెం, ముమ్మిడివరప్పాడుల్లో చర్చిల్లో ప్రార్థనలు చేస్తుంటారు.
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం గోపాలపురం చర్చికి వెళ్లేందుకు రావులపాడు కూడలి వద్ద మోటారు సైకిల్పై రహదారి దాటుతుండగా రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ కారు బలంగా ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన వరప్రసాద్ను అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. కారులో ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది సైతం గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుజ్జిబాబు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం గోపాలపురం చర్చికి వెళ్లేందుకు రావులపాడు కూడలి వద్ద మోటారు సైకిల్పై రహదారి దాటుతుండగా రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ కారు బలంగా ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన వరప్రసాద్ను అంబులెన్స్లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. కారులో ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది సైతం గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుజ్జిబాబు వెల్లడించారు.