యాప్నగరం

తూ.గో: కోతుల్ని తరిమేందుకు వెళ్లిన పెద్దాయన.. ఊహించని విధంగా వెంటాడిన మృత్యువు

ఆదివారం ఉదయం ఇంటిపైకి కోతులు గుంపులుగా రావడంతో వాటిని తరిమేందుకు ఇనుప ఊచతో డాబాపైకి ఎక్కారు. ఆయనే అక్కడికక్కడే కిందపడి చనిపోయాడు.

Samayam Telugu 13 Sep 2021, 10:05 am

ప్రధానాంశాలు:

  • తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
  • కోతుల్ని తరిమేందుకు వెళ్లాడు
  • కరెంట్ షాక్ తగలడంతో ప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తూ.గో జిల్లా
మృత్యువు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో చెప్పలేము. ఓ పెద్దాయన కోతులను తరిమేందుకు ఇంటి మేడమీదకు వెళ్లి ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపిది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామానికి చెందిన నాగం సత్యనారాయణ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇంటిపైకి కోతులు గుంపులుగా రావడంతో వాటిని తరిమేందుకు ఇనుప ఊచతో డాబాపైకి ఎక్కారు. ఇంటిని ఆనుకొని ఉన్న విద్యుత్తు తీగలకు చేతిలోని ఇనుప ఊచకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆయనే అక్కడికక్కడే కిందపడి చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.