విదేశాల్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తోన్న ఓ కిలాడీ జంటను తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం పోలీసులు అరెస్టు చేశారు. వారిని రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గోకవరం గ్రామానికి చెందిన డిడి మిల్స్ ఓనర్స్ మామిడాల శ్రీధర్, గాయత్రి భార్యాభర్తలు. వీరిద్దరూ కలసి 2019లో పచ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన దాసరి గౌరీ శంకర్ కుమార్తెను ఫారన్ తీసుకువెళ్లి ఎంబిబిఎస్ చేయిస్తామని నమ్మబలికి వారి వద్ద నుంచి 44 లక్షల రూపాయలను తీసుకున్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా గౌరీ శంకర్ కుమార్తెను ఫారన్ పంపకుండా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా భార్యాభర్తలు ఇద్దరూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన గౌరీ శంకర్ పోలీసులను ఆశ్రయించారు.
మామిడాల శ్రీధర్, గాయత్రి దంపతులపై గోకవరం పోలీస్ స్టేషన్లో గౌరీ శంకర్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ భార్యాభర్తలపై గోకవరం పోలీస్టేషన్లోనే కాకుండా రాజమండ్రి ప్రకాష్ నగర్, కిర్లంపూడి పోలీస్టేషన్లలో కూడా చీటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపిన పోలీసులకు ఈ భర్యాభర్తలు ఖమ్మంలో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్ళి వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా వారికి 15 రోజులు రిమాండ్ విదిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. శ్రీధర్, గాయత్రిలపై ఇవే కాకుండా అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన వారి వద్ద నుంచి రైస్ మిల్లుకు లోన్ ఇప్పిస్తామని 3 లక్షల రూపాయల తీసుకుని మోసం చేశారని తెలిపారు.
మామిడాల శ్రీధర్, గాయత్రి దంపతులపై గోకవరం పోలీస్ స్టేషన్లో గౌరీ శంకర్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ భార్యాభర్తలపై గోకవరం పోలీస్టేషన్లోనే కాకుండా రాజమండ్రి ప్రకాష్ నగర్, కిర్లంపూడి పోలీస్టేషన్లలో కూడా చీటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపిన పోలీసులకు ఈ భర్యాభర్తలు ఖమ్మంలో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్ళి వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా వారికి 15 రోజులు రిమాండ్ విదిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. శ్రీధర్, గాయత్రిలపై ఇవే కాకుండా అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన వారి వద్ద నుంచి రైస్ మిల్లుకు లోన్ ఇప్పిస్తామని 3 లక్షల రూపాయల తీసుకుని మోసం చేశారని తెలిపారు.