యాప్నగరం

తూ.గో: కుర్చీలో వెనక్కి తూలిన ప్రభుత్వ ఉద్యోగి, అంతే.. టెస్టుల్లో షాకింగ్ నిజం!

తూర్పు గోదావరి జిల్లా గుండేపల్లి మండలంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కూర్చున్న కుర్చీలోనే ఉద్యోగి..!

Samayam Telugu 30 Apr 2021, 7:37 pm
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్ మహమ్మారి కమ్మేస్తోంది. కరోనా ఎప్పుడు.. ఎవరిని.. ఎలా బలితీసుకుంటుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అప్పటి వరకు బాగానే ఉంటున్న మనుషులు క్షణాల్లోనే విగతజీవులుగా మారుతున్నారు. తాజాగా, హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యాలయంలో తను కూర్చున్న కుర్చీలోనే తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu కుర్చీలోనే ఉద్యోగి కన్నుమూత


స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లాలోని గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా జయశంకర్ నారాయణ విధులు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జయశంకర్‌ జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, ఆఫీసుకు మాత్రం వస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా నారాయణ విధులకు హాజరయ్యారు. ఇంతలోనే కూర్చుకున్న కుర్చీలోనే వెనక్కి తూలిన ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. కాసేపటి తర్వాత, కార్యాలయ సిబ్బంది గమనించి దగ్గరకు వెళ్లి చూడగా విషయం బటయపడింది.

అయితే తను కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతూ మృతి చెంది ఉంటారని భావించిన కార్యాలయ సిబ్బంది ఎవరూ ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. తర్వాత, ఈ విషయానికి సంబంధించి పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నారాయణ కలిసి పని చేసిన సహోద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.