యాప్నగరం

తూ.గో: వివాహితపై మరిది అరాచకం.. ఈ విషయం అతడి తల్లికి చెబితే.. షాకింగ్!

తూర్పు గోదావరి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత పట్ల మరిది వరసయ్యే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తర్వాత నిందితుడి తల్లికి చెబితే..!

Samayam Telugu 13 Mar 2021, 6:10 pm
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. తల్లిదండ్రులు పెంచిన మార్గంలోనే పిల్లలు ప్రవర్తిస్తారు. అతిగారాబం, పిల్లలపై వల్లమాలిన నమ్మకం ఒక్కోసారి చేటు కూడా చేస్తాయి. దారితప్పిన పిల్లల్ని సన్మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలి గాని.. ఫిర్యాదు చేసిన వారిపైనే దాడికి దిగడం వారి పెంపకాన్ని సూచిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని ఆత్రేయపురం పెదపేటకు చెందిన ఓ వివాహిత (23) గురువారం కిరాణా షాపునకు వెళ్లి ఇంటికి వస్తుంది. ఈ సమయంలో మరిది వరసైన వెంకటేష్‌ అనే వ్యక్తి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

దీంతో బాధిత మహిళ.. ఈ విషయాన్ని వెంకటేష్‌ తల్లికి చెప్పింది. అంతే, కోపంతో రగిలిపోయిన నిందితుడి తల్లి.. నా కొడుకు గురించి నాకు పూర్తిగా తెలుసంటూ రెచ్చిపోయింది. నా కొడుకుపై అబద్ధాలు చెబుతున్నావంటూ బాధిత మహిళపై ఆమె కర్రతో దాడి చేసింది. దీంతో బాధిత మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ విషయమై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. అలాగే బాధిత మహిళ కుటుంబ సభ్యులు కూడా, తనను కొట్టి గాయపర్చారని వెంకటేష్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.