యాప్నగరం

యువకుడి దారుణ హత్య.. రాజమండ్రిలో కలకలం

రాజమహేంద్రవరంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. బండరాయితో తల బద్దలుకొట్టి అతి కిరాతకంగా హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 10 Jun 2021, 10:26 pm
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని వీరభద్ర వీధిలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగుడు కిరాతకంగా హతమార్చారు. తలపై నాపరాళ్లతో దాడి చేసి అత్యంత అమానుషంగా అంతమొందించారు. రక్తపు మడుగులో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన త్రీటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడిని పాల వ్యాపారం చేసే యువకుడిగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu హత్యకు ఉపయోగించిన బండరాళ్లు
murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.