ద్విచక్రవాహనంపై అతడి కన్నుపడిందంటే మాయం కావాల్సిందే. ఒకటి రెండు కాదు ఏకంగా 18 బైక్లను దొంగిలించిన ఘరానా దొంగ పోలీసులకు నాటకీయంగా చిక్కాడు. దొంగలించిన ద్విచక్రవాహనంపై వెళ్తుండగానే పోలీసులకు పట్టుబడటం గమనార్హం. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన నిందితుడు ఉమామహేశ్వరరావు పలుచోట్ల ద్విచక్రవాహనాలను దొంగతనం చేశాడు. వాటిని గ్రామంలోని ఓ గోడౌన్లో దాచిపెట్టాడని తెలిపారు. శనివారం స్థానికంగా పెట్రోలు బంకు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఉమామహేశ్వరరావు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో పట్టుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడు నడుపుతున్న ద్విచక్రవాహనం దొంగిలించిందని గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా ఇప్పటి వరకూ 18 బైక్లను దొంగిలించినట్టు వెల్లడించాడు. దొంగిలించిన వాహనాలను గొడౌన్లో దాచిపెట్టినట్టు పోలీసులు తెలిపాడు.
అతడి వెంటబెట్టుకుని వాహనాలు దాచిన ప్రదేశానికి వెళ్లిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలకు సంబంధించి సామర్లకోట, పిఠాపురం, బిక్కవోలు, అనపర్తి స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ బైక్ల విలువ రూ.9 లక్షల ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. వాహనాలు పోయినవారు సంబంధిత పత్రాలతో సంప్రదిస్తే, పరిశీలించి కోర్టు ద్వారా అందజేస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా, తిరుపతిలోనూ ముగ్గురు దొంగల ముఠాను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.30 లక్షల విలువైన 40 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
అతడి వెంటబెట్టుకుని వాహనాలు దాచిన ప్రదేశానికి వెళ్లిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలకు సంబంధించి సామర్లకోట, పిఠాపురం, బిక్కవోలు, అనపర్తి స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ బైక్ల విలువ రూ.9 లక్షల ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. వాహనాలు పోయినవారు సంబంధిత పత్రాలతో సంప్రదిస్తే, పరిశీలించి కోర్టు ద్వారా అందజేస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా, తిరుపతిలోనూ ముగ్గురు దొంగల ముఠాను రెండు రోజుల కిందట అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.30 లక్షల విలువైన 40 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.