యాప్నగరం

తూ.గో: హ్యాపీ ఫ్యామిలీ.. అల్లకల్లోలం రేపిన మహమ్మారి.. భర్త మరణవార్త విని భార్య.. ఆస్పత్రిలో ఇద్దరు పిల్లలు..!

కరోనా వైరస్ మహమ్మారి కుటుంబాల్లో అల్లకల్లోలం రేపుతోంది. తాజాగా, తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

Samayam Telugu 8 May 2021, 9:02 pm
కరోనా వైరస్ మహమ్మారి కుటుంబాల్లో అల్లకల్లోలం రేపుతోంది. ఏకంగా కుటుంబాలనే మహమ్మారి బలిదీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లాలో హృదయ విదాయకర ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారినపడి భర్త మృతి చెందితే.. దీన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని గణపవరం గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన కలవల వెంకటేశ్వర్లు (53) కుటుంబంతో కలిసి గణపవరంలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వర్లు, భార్య భాగ్యలక్ష్మి (46), వారి ఇద్దరి పిల్లలకు కరోనా సోకింది. దీంతో వెంకటేశ్వర్లు చికిత్స నిమిత్తం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మే 1వ తేదీన మృతి చెందాడు.

వెంకటేశ్వర్లు భార్యతో పాటు పిల్లలకు కరోనా సోకడంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. అయితే, భార్య భాగ్యలక్ష్మికి కరోనా నెగిటివ్‌ రావడంతో బుధవారం ఇంటికి వచ్చింది. అయితే, భర్త మరణం సమాచారం తెలుసుకున్న ఆమె జీర్ణించుకోలేక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు పిల్లలిద్దరూ చిలకలూరిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ పిల్లలకు ఇంకా తల్లిదండ్రుల మరణం తెలియలేదని తెలుస్తోంది. కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని కమ్మేయడంతో తల్లిదండ్రులు కన్నుమూయగా.. పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.