యాప్నగరం

గోదావరి నదిలో ఇద్దరి మృతదేహాలు: హడలెత్తిన జనాలు.. అసలేం జరిగింది?

తూర్పు గోదావరి జిల్లాలో రెండు మృతదేహాలు బయటపడటం సంచలనం రేపింది. ఇవి ఎవరి శవాలనేదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు..!

Samayam Telugu 13 Feb 2021, 6:49 pm
గోదావరి నదిలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు బయటపడటం సంచలనం రేపింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యమయాయి. చించినాడ- దిండివారధి రోడ్డు సమీపంలో దుర్వాసన రావడంతో అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గజఈతగాళ్లను గోదావరి నదిలోకి దించి మృతదేహాలను బయటకు తీశారు.
Samayam Telugu గోదావరి నది


దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వారిలో ఒకరు సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన పోతురాజు మణికంఠ స్వామి (25)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందితో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరొకరు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వీరు ఎందుకు చనిపోయారన్నది మిస్టరీగా మారింది. నదిలో రెండు శవాలు బయటపడటంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వీరు ఎందుకు చనిపోయారనేది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.