యాప్నగరం

తూ.గో: జగ్గంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

గోకవరం నుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ ధాటికి స్తంబం.. కారుపై పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు.

Samayam Telugu 28 Jan 2021, 10:39 am

ప్రధానాంశాలు:

  • జగ్గంపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
  • విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
  • ఇద్దరు సజీవ దహనం, ముగ్గురికి గాయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేట మండలం మల్లిసాల దగ్గర గోకవరం నుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ ధాటికి స్తంబం.. కారుపై పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. మృతులను విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ బుక్కా వీధికి చెందిన హనుమంతరావు, దేవీపట్నం మండలం ఫజిల్లాబాద్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు. కారులో ఉన్న రమాదేవి, భాను, ఆదిత్యకుమార్‌ అనే ముగ్గురు బయటపడ్డారు. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని జగ్గంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే కారణమా.. పొరపాటున ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.