యాప్నగరం

ప్రత్తిపాడులో 6 గేదెల్ని చంపేసిన చిరుతపులి.. హడలెత్తిపోతున్న ప్రజలు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అటవీ శాఖ అధికారులు పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోతున్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 29 May 2022, 10:47 am
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో చిరుతపులి సంచరిస్తునట్లు అధికారులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు పులి కదలికలను నిర్ధారించారు. దీంతో పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, పులిని పట్టుకునేందుకు 120 మంది అటవీ సిబ్బందిని నియమించారు. చిరుతపులి జాడలను బట్టి ఆదివారం బోన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.
Samayam Telugu రాత్రివేళ పులి సంచారం



కాగా, గత 10 రోజులుగా ఒమ్మంగి, పోతులూరు, శరభవరం గ్రామాల్లో గత కొన్ని రోజులుగా పశువులపై పులి దాడి చేస్తోంది. ఆరు గేదెల్ని చంపేసింది. అయితే, వింత జంతువు దాడి చేస్తోందని ప్రజలు భావించారు. దీంతో చీఫ్ అటవీ అధికారి శరవణన్ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణ చేపట్టారు.

ఈ క్రమంలో సీసీటీవీ కెమెరాల ద్వారా పులి ఆనవాళ్లను గుర్తించారు. రాత్రివేళల్లో పులి తిరుగుతోందని నిర్ధారించారు. దీంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోతున్నారు. గేదెలను చంపింది పులే అని నిర్ధారణ కావటంతో సమీప గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేని పరిస్థితి ఉంది. రాత్రిళ్లు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పులిని పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు ప్రజలకు భరోసా ఇచ్చారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.