యాప్నగరం

కాకినాడ: యాసిడ్ లారీ బీభత్సం.. హోంగార్డు దుర్మరణం

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోంగార్డు సహా ఇద్దరు దుర్మరణం చెందారు. శనివారం వేకువజామున ఈ ఘటన జరిగింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 13 Aug 2022, 2:48 pm
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రోడ్డుపై ఒక్కసారిగా యాసిడ్ లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది.
Samayam Telugu లారీ ప్రమాదం


విశాఖపట్నం నుంచి యాసిడ్‌ లోడ్‌తో రాజమహేంద్రవరం వెళ్తున్న ఓ ట్యాంకర్‌.. బెండపూడి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీతో పాటు రోడ్డుపై మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు గోవిందరాజులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోవిందరాజులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధిత వ్యక్తి కూడా మరణించినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఇద్దరికి పెరిగినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.