యాప్నగరం

అమ్మ ఇక లేదని తెలియక.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు గడిపిన కుమారుడు

అప్పటి వరకూ తనకు తోడుగా ఉన్న అమ్మ చనిపోయిందని తెలుసుకోలేని స్థితిలో ఉన్న కుమారుడు.. ఆమె డెడ్ బాడీతోనే ఐదు రోజులు గడిపాడు.

Samayam Telugu 5 Jan 2021, 11:09 am
అమ్మ చనిపోయిందని తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి.. తన తల్లి మృతదేహంతో ఐదు రోజులు ఇంట్లో గడిపాడు. దుర్వాసన వస్తుండటంతో అంత్యక్రియలు జరిపేందుకు వెళ్లిన స్థానికులను అడ్డుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి.. చివరకు మున్సిపల్ సిబ్బంది సాయంతో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. మతి స్థిమితం లేకపోవడంతోనే.. అతడు ఇలా చేశాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Samayam Telugu dead body
Representative image


పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మంజులా దేవి (79) తన కుమారుడు రవీంద్ర ఫణితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు. రవీంద్రకు మతిస్థిమితం సరిగా ఉండదు. అనారోగ్యం బారిన పడిన మంజులా.. ఇటీవల చనిపోయారు. ఆమె మరణించిన విషయం తెలుసుకునే పరిస్థితిలో లేని రవీంద్ర... తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు గడిపాడు.

ఇంట్లో నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు.. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా రవీంద్ర అడ్డుకున్నాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను సైతం రవీంద్ర అడ్డుకోవడంతో.. మున్సిపల్ సిబ్బంది సాయంతో డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మతిస్థిమితం లేని రవీంద్ర.. గతంలో తన సోదరి మరణించిన సమయంలోనూ ఇలాగే ప్రవర్తించాడని స్థానికులు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.