యాప్నగరం

మహిళలతో అసభ్య ప్రవర్తన.. వీడు మనిషా.. మృగమా..!?

తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. మూడు పెళ్లిల్లు చేసుకుని.. ముగ్గురు భార్యలను వదిలేసి కొత్తమూలపేట గ్రామంలో తిరుగుతున్నాడు. మహిళల ఎదురుగా నగ్నంగా నిలబడి..

Samayam Telugu 23 Dec 2021, 4:17 pm
అడవిలో జీవించే మృగం మాదిరిగా మనిషి వేలు కొరికిన సంఘటన కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో నేర చరిత్ర కలిగిన అదే గ్రామానికి చెందిన గల్లా సూరిబాబు (45) విచక్షణ జ్ఞానం కోల్పోయి.. గ్రామంలో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. తరచుగా అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆడవాళ్లు వెళ్తుంటే దుర్భాషలాడటం వంటి అల్లరి చేష్టలు చేస్తున్నారు. మహిళలు వెళ్తుంటే నగ్నంగా వీధుల వెంబడి తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


బుధవారం కూడా అటుగా వెళ్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ.. నగ్న ప్రదర్శన చేశాడు. చుట్టుపక్కల వారు గమనించి.. సూరిబాబును అడ్డుకునేందుకు యత్నించారు. ఒక్కసారిగా సూరిబాబు కనకాల వెంకటరమణ అనే వ్యక్తి వేలు కొరికాడు. అతని చేష్టలతో విసిగి పోయిన చుట్టుపక్కల వారు చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. గతంలో అతను మూడు పెళ్లిళ్లు చేసుకుని భార్యలను వేధించడంతో భర్తను వదిలేశారని స్థానికులు తెలిపారు.

తల్లిపై కూడా అఘాయిత్యాలకు పాల్పడ్డాడని దానితో తల్లి కూడా అతన్ని విడిచి వెళ్లిపోయిందని వివరించారు. విచక్షణ జ్ఞానం కోల్పోయి మృగంలా ప్రవర్తిస్తున్న సూరిబాబును కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.