యాప్నగరం

MLC Anantababu: ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌పై హత్య కేసు.. అరెస్ట్ చేస్తామని ఎస్పీ ప్రకటన

MLC Anantababu | ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీ పేరును చేర్చామని.. ఆయన్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని.. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నామని కాకినాడ ఎస్పీ తెలిపారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 21 May 2022, 10:53 pm

ప్రధానాంశాలు:

  • కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసులో పురోగతి
  • హత్య కేసుగా మార్చిన పోలీసులు
  • ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీ అనంతబాబు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mlc anantababu
Police Filed Case Against MLC Anantababu
MLC Anantababu కాకినాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసులో ఎట్టకేలకు పోలీసులు దిగి వచ్చారు. సీఎం, డీజీపీ ఆదేశాలతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చినట్లు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. బంధువుల అనుమానం మేరకు ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీ అనంతబాబు పేరును చేర్చామన్నారు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. అనంతబాబు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ చెప్పారు.
మణికంఠ అనే వ్యక్తితో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడని చెప్పిన ఎస్పీ.. యాక్సిడెంట్ జరిగిందని సుబ్రహ్మణ్యం తల్లికి ఫోన్ చేసి చెప్పాడన్నారు.

కాగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో సుబ్రహ్మణ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. శవపరీక్ష కోసం సంతకం పెట్టాలని బలవంతం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కొట్టారని వారు చెప్పడం గమనార్హం.

జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. లాయర్ శ్రవణ్‌ కుమార్‌ సహా ఎస్సీ సంఘాల నాయకులను పోలీసులు లోపలికి అనుమతించారు. ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.

అసలేమైంది..?
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ బాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహణ్యం డెడ్ బాడీ ఉందనే వార్త శుక్రవారం రాష్ట్రమంతటా కలకలం రేపింది. గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం ఉదయం కారులో తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో అనంతబాబు తన కార్లో సుబ్రహ్మణ్యం మృతదేహంతో అతడి తల్లిదండ్రులు పని చేస్తోన్న అపార్ట్‌మెంట్ దగ్గరికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడని కుటుంబసభ్యులకు చెప్పారు. డెడ్ బాడీని తీసుకెళ్లాలని సూచించారు. దానికి వారు అంగీకరించకపోవడంతో.. ఎమ్మెల్సీ తన కారును అక్కడే వదిలేసి వెళ్లారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.