యాప్నగరం

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. ముద్రగడతో సోము వీర్రాజు భేటీ.. తర్వాత ఆ ఇద్దరి వంతు?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

Samayam Telugu 16 Jan 2021, 9:32 am
ఏపీలో బలపడటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వైఎస్సార్సీపీకి తామే ప్రత్యామ్నాయం అని చాటేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతకు వల విసురుతోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన ప్రధాన నేతలపై కమల దళం ఫోకస్ పెట్టింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.
Samayam Telugu veerraju-mudragada


ఇటీవలే నటి వాణీవిశ్వనాథ్‌ను కలిసి.. బీజేపీలో చేరిక విషయమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము‌ వీర్రాజు చర్చించారు. ఇప్పుడు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను ఆయన కలుస్తున్నారు. ఈ రోజు (శనివారం) ఉదయం 9 గంటలకు ముద్రగడతో తాను భేటీ కాబోతున్నట్లు సోము వీర్రాజు ట్వీట్ చేశారు.

ముద్రగడను కలిసిన అనంతరం.. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, పడాల అరుణను సైతం సోము వీర్రాజు కలుస్తారని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి వారితో చర్చించే అవకాశం ఉంది. కాగా తాను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కళా వెంకట్రావు ఖండించారు. సోము వీర్రాజు మా ఇంటికి వస్తారని తనకు సమాచారం కూడా లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.