Kakinada: ముగ్గురి ప్రాణాలను కాపాడిన రైల్వే ట్రాక్మన్.. చివరి నిమిషంలో ఆ విషయం చెప్పకపోయుంటే
Pithapuram Trackman ముగ్గురిని కాపాడారు. అత్తింటిలో వేధింపులతో.. ఇద్దరు కూతుర్లతో కలిసి ప్రాణాలు తీసుకోవాలనుకున్న మహిళ.. ముగ్గురు కలిసి రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లారు. రైలు వస్తున్న సమయంలో ట్రాక్పై వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో గమనించి ట్రాక్మన్.. పరుగున అక్కడికి వెళ్లారు. దగ్గర దారి కావడంతో పట్టాలు దాటుకుని వెళుతున్నామని చెప్పిన మహిళ. ఇంతలో కూతురు అసలు విషయం చెప్పడంతో పెను ప్రమాదం తప్పింది. ముగ్గురిని కాపాడిన రైల్వే ట్రాక్మన్.
ప్రధానాంశాలు:
- కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలో ఘటన
- ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ముగ్గురు
- ముగ్గురి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో
ఓ రైల్వే ట్రాక్మన్ రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు ట్రాక్పైకి వచ్చిన ముగ్గుర్ని కాపాడి ప్రశంసలు అందుకుంటున్నారు. కాకినాడ జిల్లా (Kakinada District) గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే స్టేషన్ దగ్గర ఘటకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పోతులూరుకు చెందిన శివకు, చేబ్రోలుకు చెందిన వెంకటలక్ష్మిల వివాహైంది.. భవ్యశ్రీ, పార్థు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంలో మగ పిల్లవాడు లేరంటూ వెంకటలక్ష్మిని భర్త, అత్త కాసులమ్మ వేధించేవారు. భర్తకు విడాకులు ఇవ్వాలంటూ వెంకటలక్ష్మిపై ఒత్తిడి తెచ్చేవారు. ఆమె కూడా చిత్రహింసలు భరించింది. ఇంతలో మళ్లీ అదనపు కట్నం తేవాలని బాధితురాలిని వేధించడం మొదలు పెట్టారు.. దీంతో పెద్దలు వెళ్లి సర్థిచెప్పారు. ఇదంతా పెద్దలకు చెప్పడంతో భర్త శివ భార్యపై దాడి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది.
వెంకటలక్ష్మి ఇద్దరు కూతుర్లను తీసుకుని దుర్గాడ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లింది. ట్రాక్పైకి వెళ్లగానే విశాఖ– విజయవాడ సూపర్ఫాస్ట్ రైలు వస్తోంది. ఇదే సమయంలో ట్రాక్మన్ వెంకటేశ్వరరావు ట్రాక్ను పరిశీలిస్తున్నాడు. 655వ మైలు రాయి దగ్గర ఉన్న సమయంలో.. వెంకటలక్ష్మి తన పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్పై వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే అక్కడికి పరిగెత్తి వెళ్లి అడ్డుకున్నాడు. ఏం జరిగిందని ఆరా తీస్తే వెంకటలక్ష్మి మాట మార్చి చెప్పింది
తనకు తెలిసిన వారు ఆ దగ్గరలోనే ఉన్నారని.. అందుకే దగ్గర దారి కావడంతో ట్రాక్పై నుంచి ఇలా వెళుతున్నానని వెంకటేశ్వరరావుకు చెప్పింది. ఇంతలో అమ్మను నాన్న కొట్టాడని.. అందుకే అమ్మ తమను తీసుకుని ఇలా వచ్చేసిందని కుమార్తె భవ్యశ్రీ అతడికి అసలు విషయం చెప్పింది. వెంకటేశ్వరరావు ఆ ముగ్గురినీ ట్రాక్పై నుంచి పక్కకు తోసేసి వారిని కాపాడాడు.
అప్పటికే ట్రైయిన్ చాలా దగ్గరకు రావడంతో రెప్పపాటులో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పిఠాపురం (Pithapuram) పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని కాకినాడ తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, బంధువులకు అప్పగించారు. వరుసగా ఆడపిల్లలే పుట్టారని, అదనపు కట్నం తేవాలిని అత్తింటివారు వేధించడంతోనే పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తేల్చారు. కానీ ట్రాక్మన్ వెంకటేశ్వరరావు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ముగ్గురినీ కాపాడారు.. దీంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. రియల్ హీరో అంటున్నారు. చివరి నిమిషంలో కుమార్తె అసలు విషయం చెప్పకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు చర్చించుకున్నారు.
వెంకటలక్ష్మి ఇద్దరు కూతుర్లను తీసుకుని దుర్గాడ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లింది. ట్రాక్పైకి వెళ్లగానే విశాఖ– విజయవాడ సూపర్ఫాస్ట్ రైలు వస్తోంది. ఇదే సమయంలో ట్రాక్మన్ వెంకటేశ్వరరావు ట్రాక్ను పరిశీలిస్తున్నాడు. 655వ మైలు రాయి దగ్గర ఉన్న సమయంలో.. వెంకటలక్ష్మి తన పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్పై వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే అక్కడికి పరిగెత్తి వెళ్లి అడ్డుకున్నాడు. ఏం జరిగిందని ఆరా తీస్తే వెంకటలక్ష్మి మాట మార్చి చెప్పింది
తనకు తెలిసిన వారు ఆ దగ్గరలోనే ఉన్నారని.. అందుకే దగ్గర దారి కావడంతో ట్రాక్పై నుంచి ఇలా వెళుతున్నానని వెంకటేశ్వరరావుకు చెప్పింది. ఇంతలో అమ్మను నాన్న కొట్టాడని.. అందుకే అమ్మ తమను తీసుకుని ఇలా వచ్చేసిందని కుమార్తె భవ్యశ్రీ అతడికి అసలు విషయం చెప్పింది. వెంకటేశ్వరరావు ఆ ముగ్గురినీ ట్రాక్పై నుంచి పక్కకు తోసేసి వారిని కాపాడాడు.
అప్పటికే ట్రైయిన్ చాలా దగ్గరకు రావడంతో రెప్పపాటులో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పిఠాపురం (Pithapuram) పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని కాకినాడ తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, బంధువులకు అప్పగించారు. వరుసగా ఆడపిల్లలే పుట్టారని, అదనపు కట్నం తేవాలిని అత్తింటివారు వేధించడంతోనే పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తేల్చారు. కానీ ట్రాక్మన్ వెంకటేశ్వరరావు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ముగ్గురినీ కాపాడారు.. దీంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. రియల్ హీరో అంటున్నారు. చివరి నిమిషంలో కుమార్తె అసలు విషయం చెప్పకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు చర్చించుకున్నారు.
- Read LatestAndhra Pradesh News and Telugu News