యాప్నగరం

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి శుభవార్త.. మరో స్పెషల్ రైలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 18న ప్రత్యేక రైలు (07458) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.

Samayam Telugu 14 Jan 2021, 11:47 am
సంక్రాంత్రి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చినవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 18న ప్రత్యేక రైలు (07458) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్‌ నుంచి రాత్రి 8:40 గంటలకు బయలు దేరి సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లి గూడెం, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8:45 గంటలకు సికింద్రాబాద్‌ చేరనుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
Samayam Telugu స్పెషల్ రైలు


ఈ రైలు మాత్రమే కాదు.. సంక్రాంత్రి రద్దీ ఉండటంతో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోంది. విశాఖ, తిరుపతి, విజయవాడ ఇలా స్పెషల్ ట్రెయిన్లు ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో రద్దీ ఉండే అవకాశం ఉండటంతో మరో రైలును ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.