యాప్నగరం

CM Jagan రాజీ పడే ప్రసక్తే లేదు.. చంద్రబాబుతో బహిరంగ చర్చ నేను సిద్ధం: ఎంపీ మార్గాని భరత్

Polavaram project నిర్మాణంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. అవగాహన లేకుండా డయాఫ్రమ్ కట్టడంతో వరదలకు దెబ్బతిందన్నారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పోలవరం పరిశీలించి..

Samayam Telugu 6 Mar 2022, 7:00 pm
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ముందుగా కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేశారని.. వరదలు రావడంతో వాల్ మొత్తం కొట్టుకుపోయిందన్నారు. అవగాహన లేకుండా డయాఫ్రమ్ కట్టడంతో వరదలకు దెబ్బతిందన్నారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పోలవరం పరిశీలించి.. డయాఫ్రమ్ వాల్ గురించి చర్చించారని చెప్పారు.
Samayam Telugu ఎంపీ మార్గాని భరత్ రామ్


'పోలవరంపై చంద్రబాబుతో తాను బహిరంగ చర్చ సిద్ధం.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం జగన్ రాజీ పడే ప్రసక్తే ఉండదు. 190 టీఎసీంలకు ఒక్క టీఎంసీ కూడా తగ్గకుండా పోలవరంలో నిల్వ ఉంటుంది. పోలవరం బ్యారేజ్ అవుతుందనేది దుష్ప్రచారం చేస్తున్నారు..' అని ఎంపీ మార్గాని మండిపడ్డారు. మంత్రులుగా చేసిన వాళ్లు డ్యామ్‌కు బ్యారేజ్‌కు తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

గతంలో కాపర్ డ్యామ్ కట్టేసి.. దాని ద్వారా నీళ్లను విడుదల చేద్దామని చంద్రబాబు చూశారని ఎంపీ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కాపర్ డ్యామ్ కట్టేశామని.. స్పిల్ వే ద్వారా వాటర్ కూడా వెళుతోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేయనున్నారని చెప్పారు. పోలవరం అథారిటీ కార్యాలయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి తరలించాలని కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నామని తెలిపారు. త్వరలోనే ఆ కార్యాలయం రాజమండ్రికి రాబోతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.