యాప్నగరం

ఆ విషయం కేసీఆర్ కూడా చెప్పారు: కేంద్రం క్రెడిట్ మేం తీసుకోం.. ఎంపీ మార్గాని భరత్

కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా అంశాన్ని తీసేయడానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రధాన కారణమని ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని..

Samayam Telugu 16 Feb 2022, 6:48 pm
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. తెలుగువారై ఉండి జీవీఎల్ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేకహోదా అంశాన్ని తీసేయడానికి ఆయనే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని మార్గాని డిమాండ్ చేశారు.
Samayam Telugu ఎంపీ మార్గాని భరత్


'ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై 22 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడాం. తాము మాట్లాడటం వల్లే ప్రధాని మోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగింది. కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అని చంద్రబాబు మహిళలను అవహేళన చేశారు. ఏ మొఖం పెట్టుకుని తెలుగుదేశం మహిళలు దీక్షలు చేస్తున్నారు..?' అంటూ ఎంపీ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,100 కోట్లు రీఎంబర్స్ చేయాల్సి ఉందని మార్గాని భరత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు అని అన్నారు. కేంద్రం క్రెడిట్ తాము తీసుకోమని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.