యాప్నగరం

రాజమండ్రి: దర్జాగా వచ్చి డబ్బు, గోల్డ్ దోచేస్తారు.. దొంగతనాలు ఇలా కూడా చేస్తారా!

నారాయణపురం వాంబేకాలనీలో సరస్వతమ్మ నివాసం ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. ఇద్దరూ లోపలికి వచ్చారు.. ఆధార్‌ కార్డు చూపించాలని అడిగారు.

Samayam Telugu 22 Jan 2021, 8:17 am
రాజమండ్రిలో దొంగలు రూటు మార్చారు. చోరీలకు కొత్త ప్లాన్‌లు వెతుక్కుంటున్నారు.. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పేరుతో వచ్చి దోచేస్తున్నారు. నగరంలో జరిగిన ఓ దొంగతనం కలకలంరేపింది. నారాయణపురం వాంబేకాలనీలో సరస్వతమ్మ నివాసం ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి వచ్చామని.. తాగునీటి కొళాయి ఉంటే చూపించాలని అడిగారు. ఇద్దరూ లోపలికి వచ్చారు.. ఆధార్‌ కార్డు చూపించాలని అడిగారు.
Samayam Telugu రాజమండ్రి


సరస్వతమ్మ బీరువాలో ఉన్న కార్డు తీసుకు వచ్చి ఇచ్చింది. ఇద్దరిలో ఒకరు ఆమెను మాటల్లో ఉంచగా.. మరో వ్యక్తి బీరువాలో ఉన్న బంగారు వస్తువులు, రూ.30 వేల డబ్బునుచోరీ చేశాడు. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి జారుకున్నారు.. తర్వాత బంగారం, డబ్బు పోయిన విషయం గమనించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.చోరీ చేసిన బంగారం ఆరు కాసులు ఉంటుందని బాధితురాలు చెబుతోంది. ఇలాంటి అపరిచిత వ్యక్తలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.