యాప్నగరం

రఘురామ కృష్ణరాజు ఎంపీ సభ్యత్వం కోల్పోయినట్లే.. వైసీపీ చీఫ్ విప్ సంచలనం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సంచలన కామెంట్స్ చేశారు.

Samayam Telugu 29 Jun 2021, 11:42 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే పెద్ద ఎత్తున విమర్శలు రఘురామ కృష్ణరాజు వ్యవహరంపై రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌ రామ్‌ ఫైరయ్యారు. పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్టీ సభ్యత్వంతో పాటు, పార్లమెంటు సభ్యత్వాన్ని వలంటీర్‌గానే కోల్పోయారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ అభిప్రాయపడ్డారు.
Samayam Telugu ఎంపీలు రఘురామ, మార్గాని భరత్


రఘురామ కృష్ణరాజు వరుసగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి రాస్తున్న లేఖలపై మంగళవారం ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడారు. పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ, పార్టీలో ఉంటూ పార్టీ వైఖరిని దూషిస్తున్న వ్యక్తి వలంటీర్‌గానే ఆ పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు అవుతుందని భరత్ అన్నారు. ఎందుకంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్దేశించుకున్న మేనిఫెస్టోనే ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. అయితే మేనిఫెస్టోను అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని దూషిస్తున్న రఘురామ వైఖరిని దేశ ప్రజలందరూ చూస్తున్నారని చెప్పారు.

రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 10 ప్రకారం ఎంపీ రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయమని భరత్ అన్నారు. అయితే ఒకటి, రెండు రోజులు ఆలస్యం అయినా నిర్ణయం మాత్రం న్యాయం పక్కనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.