యాప్నగరం

పది రూపాయల డాక్టర్ ఇకలేరు.. విషాదంలో రాజోలు ప్రాంత వాసులు!

రాజోలు ప్రాంతంలో గత 50 ఏళ్లుగా పేదలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ భూపతి నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. పది రూపాయల డాక్టర్‌గా ఆయన పేరొందారు.

Samayam Telugu 2 Mar 2021, 2:16 pm
తూర్పుగోదావరి జిల్లా రాజోలు దీవిలో ఎందరో పేదలకు నామమాత్ర ధరకే వైద్య సేవలు అందించిన డాక్టర్ భూపతి నాగేశ్వర రావు మరణించారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. కేవలం పది రూపాయల ఫీజు తీసుకొని భూపతి రావు వేలాది మందికి వైద్యం చేశారు. దీంతో ఆయన పది రూపాయల డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజోలు దీవిలోని 4 మండలాల్లో 50 ఏళ్లపాటు ఆయన పేదలకు వైద్య సేవలు అందించారు.
Samayam Telugu doctor


పేదల దేవుడిగా పేరొందిన డాక్టర్ భూపతి నాగేశ్వర రావు మరణంతో రాజోలు ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మహనీయుడు మరణించాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తీర్చలేమంటూ.. డాక్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.