యాప్నగరం

జనసైనికులు నాకు ఓటేశారు.. దొంగ ఓట్లని సరదాగా నవ్వుకోవడానికే చెప్పా: ఎమ్మెల్యే రాపాక

Rapaka Vara Prasad On Fake Votes వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దొంగ ఓట్లు తన విజయానికి సహకరించేవి అంటూ వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేపింది. దీంతో ఆయన తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ఏదో సరదాగా నవ్వుకోవడానికి తాను అలా మాట్లాడాను అన్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. సీరియస్‌గా తాను ఆ కామెంట్స్ చేయలేదన్నారు. అన్ని కులాల వారు ఓట్లేస్తేనే తాను ఎమ్మెల్యేగా గెలిచానన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Mar 2023, 10:42 am

ప్రధానాంశాలు:

  • ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వీడియో వైరల్
  • వివాదం రేగడంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం
  • తాను సరదాగా అలా మాట్లాడానన్న ఎమ్మెల్యే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rapaka Vara Prasad On Fake Votes
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Vara Prasad) దొంగ ఓట్లతో గెలిచానంటూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో రాపాక స్పందించారు. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సందర్భాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తావిస్తే.. దానిని ఇప్పుడు జరిగి నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. తన వ్యాఖ్యల్ని కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీరిస్తున్నారన్నారు. తాను స‌ర్పంచ్ ఎన్నిక‌లకు సంబంధించిన విషయాన్ని న‌వ్వుకోవడానికి మాత్ర‌మే చెప్పాన‌న్నారు.. సీరియస్‌గా చెప్పింది కాదన్నారు. తనకు అన్ని కులాల వాళ్లు ఓట్లు వేయడంతోనే ఎమ్మెల్యే అయ్యానన్నారు.
గత ఎన్నికల్లో తను జనసైనికులే ఓటు వేశారన్నారు ఎమ్మెల్యే రాపాక. అయితే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే జనసైనికులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన పార్టీ తనను ఓటు వేయమని అడిగిందా.. తాను వైఎస్సార్‌సీపీలోకి వచ్చానని బొంతు రాజేశ్వరరావు వర్గం ఆత్మీయ సమావేశం పెట్టి ఆహ్వానించారన్నారు. బొంతు రాజేశ్వరరావు చేతకాని దద్దమ్మ.. రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ గాలి వీచినా సత్తా లేక బొంతు రాజోలులో ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

తాను 2019లో 810 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై విజయం సాధించానని.. 2009లో కాంగ్రెస్ నుంచి 4వేల 600 ఓట్ల ఆధిక్యంతో గెలిచానని గుర్తు చేశారు. తాను ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నన్ను ప్రలోభ పెట్టినట్లు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. వైరల్ అవుతున్న వీడియోతో అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు రాపాక.

ఎమ్మెల్యే రాపాక వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన సొంత ఊరైన చింతలమోరిలో పోలింగ్ బూత్ గురించి.. ఎన్నికల గురించి ప్రస్తావించారు. అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లు తనకు వేసేవారని కామెంట్ చేశారు. అలా తన గెలుపునకు ఆ ఓట్లు సహకరించేవి అన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై విమర్శలొచ్చాయి. దీంతో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు.

అంతేకాదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసేందుకు తనను టీడీపీ ప్రలోభపెట్టిందన్నారు రాపాక వరప్రసాద్. ముందు తన స్నేహితుడి ద్వారా సంప్రదించారని.. ఆ తర్వాత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ద్వారా ప్రయత్నించారన్నారు. సిగ్గు వదిలేసి తాను అలాంటి పని చేయలేనని.. సమాజంలో తలెత్తుకుని ఉండలేమన్నారు రాపాక. తాను జగన్ నాయకత్వాన్ని నమ్మానని.. ఆయన వెంటే ఉంటానన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.