అతడో చిన్న ఉద్యోగి.. రోజంతా విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో తిరిగి వస్తుంటాడు. పాపం, దురదృష్టం వెంటాడింది. ఉన్నట్టుండి అతడి స్కూటీ మంటల్లో కాలిపోయింది. పోతే పోనీలే.. యజమాని డబ్బులు సేఫ్గా ఉంటాయనుకున్నాడు.. కానీ అతడి బ్యాడ్ లక్.. ఆ డబ్బులు కూడా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం బళ్ల మార్కెట్ సమీపంలోని భీమవరంపేటలో సోమవారం అర్ధరాత్రి దాటిన సమయంలో అనుమానాస్పద స్థితిలో స్కూటీ దగ్ధమైంది. బాధితుడు దూలపల్లి రాజు సోమవారం ఉద్యోగ విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాలు తిరిగొచ్చాడు. రాత్రివేళ ఇంటి పక్కనే స్కూటీ పార్క్ చేసి నిద్రపోయాడు. అయితే రాత్రి 12 గంటల సమయంలో పక్కింటి వ్యక్తి వచ్చి మోటార్ సైకిల్ కాలిపోతున్నట్టు చెప్పాడు. దీంతో రాజు బయటికి వచ్చి చూసేలోగానే స్కూటీ మొత్తం కాలిపోయింది. స్కూటీ డిక్కీలో తన యజమానికి చెందిన 50వేల రూపాయల నగదు ఉంచి తాళం వేసినట్లు రాజు చెబుతున్నాడు.
ఆ డబ్బులు సేఫ్గా ఉంటాయని అనుకున్నానని.. కానీ ఆ డబ్బులు కూడా పూర్తిగా కాలిపోవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తూ జరిగిందా.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటిచారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఆ డబ్బులు సేఫ్గా ఉంటాయని అనుకున్నానని.. కానీ ఆ డబ్బులు కూడా పూర్తిగా కాలిపోవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తూ జరిగిందా.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటిచారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News