యాప్నగరం

కాకినాడ జిల్లాలో ఘోరం... ఆరుగురు మహిళలు దుర్మరణం!

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఆరుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో, ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 14 May 2023, 3:39 pm
కాకినాడ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో.. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తాళ్లరేవు మండలం సీతారామపురంలోని సుబ్బరాయునిదిబ్బ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


రొయ్యల పరిశ్రమలో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆస్పత్రికి, మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతులంతా యానాంలోని నీలపల్లికి చెందిన వారుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.