Ap Zptc Mptc Electionsలో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం బద్దంగా వెళ్లడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సంక్షేమ పథకాల ఆశ ఓటు వెయ్యక పోతే అవి తీసేస్తాం అని బెదిరింపులు పర్వం తో ఎన్నికలు గెలిచారన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే టిడిపి సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఒంటరిగా పరీక్షలు రాసి తమకు క్లాస్ ఫస్ట్ వచ్చింది అని చెప్పినట్లు వైసీపీ నాయకులు తీరు ఉందని ఎద్దేవా చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థని నాశనం చేశారని.. ప్రతిపక్ష నేతల ఇళ్ల పై దాడులు,బెదిరింపులు పర్వం అనేవి హేయమైన చర్యన్నారు. వైసీపీ నేతలు సంక్షేమ పథకాల లబ్దిదార్లను ఓట్ల కోసం భయపెట్టారని.. అందుకే పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందన్నారు బుచ్చయ్య. వైసీపీ ప్రభుత్వ తీరు పై ప్రజా ఉద్యమాల ద్వారా బయటకి వస్తామన్నారు. ఎంపీపీ స్థానాలకు అవకాశం ఉన్నచోట్ల జనసేనతో సర్దుబాటు చేసుకుంటామని.. ఎన్నికలలో కూడా జనసేనతో సర్దుబాటు చేసుకునే స్థానికంగా పోటీ చేస్తామన్నారు. అసలు అమ్మఒడి పేరుతో పంగనామము పెట్టి ఇద్దరు పిల్లలు ఉంటే అమ్మఒడి లేకుండా చేశారన్నారు. విదేశీ విద్యకి తూట్లు పొడిచారని.. అసలు ముఖ్యమంత్రి బాబాయ్ హత్యని ఇప్పటి వరకు చేధించలేదని.. అలాంటిది రాష్ట్రాన్ని,రాష్ట్ర ప్రజలని ఎలా కాపాడతాడరన్నారు. మహిళలుకి రక్షణ ఎలా కల్పించగలరన్నారు.
Jansena Partyతో సర్దుబాటు చేసుకునే పోటీ చేస్తాం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఒంటరిగా పరీక్షలు రాసి తమకు క్లాస్ ఫస్ట్ వచ్చింది అని చెప్పినట్లు వైసీపీ నాయకులు తీరు ఉందని ఎద్దేవా చేశారు. అందుకే పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందన్నారు.
Samayam Telugu 21 Sep 2021, 8:52 am
ప్రధానాంశాలు:
- ఏపీ పరిషత్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
- ఒంటరిగా పరీక్ష రాసి పాస్ అయినట్లు ఉంది
- ఆ కారణంతోనే టీడీపీ ఎన్నికల బహిష్కరణ