యాప్నగరం

ఓహో.. అదిరిందయ్యా పుష్పములు.! సీట్లు, ఓట్లేనా? క్యాబినెట్‌పై సీనియర్ నేత కామెంట్స్

సీనియర్ మంత్రులను సైతం పక్కనబెట్టి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే కేంద్ర క్యాబినెట్‌ కూర్పుపై సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏపీ నుంచి ఒక్కరికి కూడా పదవి దక్కకపోవడంపై పెదవి విరుస్తున్నారు.

Samayam Telugu 8 Jul 2021, 2:19 pm
బీజేపీ నేతృత్వరంలోని ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ విస్తరణపై అదిరిపెయే సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి కనీసం చోటు దక్కకపోవడంపై ఆయన సునిశిత విమర్శలు చేశారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజలకి న్యాయం చేయాలనే తపన ఏ మాత్రం లేకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bjp


ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూసిందని.. కేవలం సీట్లు, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప తెలుగు ప్రజలకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్ కూర్పుతో ఆంధ్రాలో ఇప్పట్లో ఎన్నికలు లేవని అర్థమైందన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే మినహా బీజేపీ మనవైపు చూడదన్నమాట.! అంటూ సెటైర్లు విసిరారు. ఓహో అదిరిందయ్యా పుష్పములు అంటూ కమలం పార్టీని ఎద్దేవా చేశారు.



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.