తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమాటా లోడు లారీ బైక్ని ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు నుంచి కాకినాడకు టమాటా లోడుతో వెళ్తున్న ఐషర్ వ్యాన్ రావులపాలెం వైపు నుంచి గోపాలపురం వైపు వస్తున్న బైక్ని ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న గోపాలపురానికి చెందిన కండేల్లి సతీష్ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన వంగలపూడి సురేంద్ర (23), గోపాలపురానికి చెందిన కొండేటి చంటి (20)లకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో తణుకు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న రావులపాలెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐషర్ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read:
ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న గోపాలపురానికి చెందిన కండేల్లి సతీష్ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన వంగలపూడి సురేంద్ర (23), గోపాలపురానికి చెందిన కొండేటి చంటి (20)లకు తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో తణుకు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న రావులపాలెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐషర్ వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read: