యాప్నగరం

YSRCP సభలో ఊహకందని విషాదం.. కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు మహిళలు మృతి, ఇంకో ఆరుగురు..!

పశ్చిమ గోదావరి జిల్లా ఊహకందని విషాదం చోటుచేసుకుంది. వైసీపీ నేతలు నిర్వహించిన సభలో కొబ్బరి చెట్టు కూలి..

Samayam Telugu 9 Jan 2021, 11:11 pm
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వైసీపీ నేతల సమావేశం జరుగుతున్న సమయంలో ఉన్నట్లుండి కొబ్బరి చెట్టు కూలడంతో మీద పడి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు.
Samayam Telugu కూలిపోయిన కొబ్బరిచెట్టు


వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తణుకు మండలంలోని రేలంగి గ్రామంలో జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. అయితే పట్టాల పంపిణీ కోసం గ్రామానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో మహిళలు కూర్చున్న చోట ప్రమాదవశాత్తు కొబ్బరి చెట్టు కూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కాసాని దుర్గా భవాని (30), శాంతకుమారి (35) అనే ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.