యాప్నగరం

ప్రియుడికి పెళ్లైందని తెలిసి ప్రియురాలు.. అమలాపురంలో విషాదం

ఇల్లు అద్దెకు తీసుకుని ప్రేమికులిద్దరూ సహజీవనం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెద్దలు పెళ్లి విషయం మాట్లాడేందుకు పంచాయితీ పెట్టడంతో షాకింగ్ విషయం బయటపడింది.

Samayam Telugu 24 Dec 2020, 1:36 pm
సహజీవనం చేస్తున్న ప్రియుడికి గతంలోనే వివాహమైందని తెలియడంతో మనస్థాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అమలాపురంలో జరిగింది. అల్లవరం మండలం డి.రావులపాలేనికి చెందిన కందికట్ల శాంతికుమారి(32) అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. గతంలో అదే ఆస్పత్రిలో నర్సు ట్రైనింగ్ పూర్తి చేసిన ఆమె అక్కడే పదేళ్లపాటు నర్సుగా పనిచేసింది. అనంతరం ఐదేళ్లు కువైట్‌‌లో పనిచేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
cheating


గతేడాది అక్కడి నుంచి తిరిగొచ్చిన ఆమె 11 నెలల కిందట మళ్లీ కిమ్స్‌లో నర్సుగా చేరింది.
పట్టణంలోని కామనగరువు శివారు రామదాసు కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆమెకు ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన జంగా శ్రీనుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కలసి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే పెళ్లి విషయమై ఈ నెల 21న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో ప్రియుడి మోసం బయటపడింది.

అతనికి అప్పటికే పెళ్లైందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో శాంతికుమారి తీవ్ర మనస్థాపానికి గురైం ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు శ్రీను చేసిన మోసం కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ లేఖ రాసి పెట్టి మరీ ప్రాణాలు తీసుకుంది. మరుసటి రోజు కూతురు ఫోన్ ఎత్తడం లేదని నేరుగా ఇంటికొచ్చిన తండ్రి విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.