యాప్నగరం

కాకినాడ: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేని యువకుడు.. పిన్ని ఇంటికి వెళ్లి

రాజా రమేష్‌ చేపలు వేటకు వెళ్తుంటాడు. అతడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రుల్ని కలిసి ఇద్దరికి పెళ్లి చేయమని అడిగాడు.

Samayam Telugu 18 Dec 2020, 8:36 am
ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యానాం సావిత్రినగర్‌కు చెందిన రాజా రమేష్‌ చేపలు వేటకు వెళ్తుంటాడు. అతడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రుల్ని కలిసి ఇద్దరికి పెళ్లి చేయమని అడిగాడు.. వారు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఈనెల ఒకటిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి రమేష్‌ కూడా ఆవేదనతో ఉన్నాడు.. కొద్దిరోజులుగా అతడు బాధపడుతున్నాడు.
Samayam Telugu ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక


రాజా రమేష్ తన ప్రియురాలు లేదనే విషయాన్ని మర్చిపోలేకపోయాడు. అతడు తన పిన్ని ఇంటికెళ్లి ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని వెంటనే ఖననం చేశారు.. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో వివరాలు సేకరించారు. ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తల్లిదండ్రుల్ని కూడా ప్రశ్నించారు. 15 రోజుల వ్యవధిలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.