రాజమండ్రి రూరల్ కోలమూరులో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడిని హత్య చేసిన ఓ యువకుడు.. మృతదేహాన్ని తగలపెట్టే ప్రయత్నం చేశాడు. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రిలోని ఆర్యపురానికి చెందిన నాగసాయి అలియాస్ వెంకటేష్ (25), సాయిపవన్ అనే వ్యక్తులు ఇద్దర స్నేహితులు. ఇద్దరు ఒకే చోట పౌరహిత్యం నేర్చుకుంటున్నారు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేకపోవడంతో కోలమూరు సమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.
అయితే సాయి పవన్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అధిక మొత్తంలో స్నేహితులకు డబ్బు ఖర్చు చేస్తుండడంతో వెంకటేష్.. పవన్ను మందలించేవాడు. దీంతో కక్ష పెంచుకున్న పవన్.. స్నేహితులతో కలిసి వెంకటేష్ను ఈ నెల 24న హత్య చేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు వీలు కాకపోవడంతో గత 11 రోజులుగా గదిలోనే దాచిపెట్టారు.
మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్నారు. ఆ గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇంటి బాత్ రూమ్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్లు రాజానగరం సీఐ ఎంవీ సుభాష్, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.
అయితే సాయి పవన్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అధిక మొత్తంలో స్నేహితులకు డబ్బు ఖర్చు చేస్తుండడంతో వెంకటేష్.. పవన్ను మందలించేవాడు. దీంతో కక్ష పెంచుకున్న పవన్.. స్నేహితులతో కలిసి వెంకటేష్ను ఈ నెల 24న హత్య చేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు వీలు కాకపోవడంతో గత 11 రోజులుగా గదిలోనే దాచిపెట్టారు.
మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్నారు. ఆ గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇంటి బాత్ రూమ్లో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్లు రాజానగరం సీఐ ఎంవీ సుభాష్, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.