యాప్నగరం

ఒక్కరోజు ముందు వైసీపీ, ఆ మరుసటి రోజే టీడీపీలో చేరిక.. ఆసక్తికర రాజకీయం

Pithapuram Sarpanch Rajini ఒక్క రోజులోనే పార్టీ మార్చేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యేతో వివాదంతో రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయ్యారు. తనకు అవవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే తీరుపై నిరసన చేపట్టారు. అక్కడితో ఆగకుండా మరుసటి రోజే వెళ్లి మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. ఆమె వెంట పలువురు అనుచరులు కూడా టీడీపీలో చేరారు. కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉన్న సర్పంచ్ రజిని.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 Apr 2023, 11:01 am
కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్‌సీపీలో మహిళ సర్పంచ్ ఒక్కరోజులోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పిఠాపురం మండలం నవకండ్రవాడలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ బల్ల రజిని, ఆమె భర్త సురేష్‌ గ్రామ సమస్యలను విన్నవించుకునేందుకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Mla Pendem Dorababu) దగ్గరకు వెళ్లారు. తమ గ్రామానికి వస్తున్నట్లు, కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తమకు ముందుగానే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
Samayam Telugu Pithapuram Sarpanch


సర్పంచ్ రజిని గ్రామంలో సమస్యలను ఎమ్మెల్యేకు వివరించేందుకు ప్రయత్నించగా.. స్థానిక వైఎస్సార్‌సీపీ (Ysrcp) నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌ను పక్కకు నెట్టడంతో తోపులాట జరిగింది. పోలీసులు కూడా సర్పంచిని అడ్డుకున్నారు.. అటు ఎమ్మెల్యే కూడా తనను పట్టించుకోలేదని ఆమె మనస్తాపానికి గురయ్యారు. సర్పంచ్‌ బల్ల రజిని, ఆమె భర్త ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్పంచ్ దంపుతులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సీఎం జగన్‌ (Cm Jagan) ఫోటోలతో ఎమ్మెల్యే ఎదుట నిలబడి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గ్రామ సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు.. ఆ వెంటనే వివాదం మరింత ముదిరింది. తాను ఎస్సీ మహిళ కావడంతోనే వివక్ష చూపుతున్నారని రజిని అంటున్నారుజ గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని.. గతంలో కూడా పంచాయతీ సమావేశంలో దాడి చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గం నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు.

శనివారం ఈ వ్యవహారమంతా జరగ్గా.. ఆదివారం సర్పంచ్ రజిని సొంత పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. బళ్ల రజినీ వాణి, ఆమె భర్త సురేష్‌ ఆధ్వర్యంలో మరో 30 మంది ఆదివారం టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వర్మ (Ex Mla Svsn Varma) వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు సొంతపార్టీ మహిళా సర్పంచి రజినీ విషయంలో దారుణంగా వ్యవహరించారని.. ఆమెను దగ్గరుండి నెట్టివేయించారన్నారు.

అధికార పార్టీ దళితులను దూరం పెడుతూ, శత్రువుల్లా చూస్తున్నారన్నారు వర్మ. గతంలోనూ పార్టీ నాయకులు వేధిస్తున్నారని సర్పంచి రజినీ కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దళితుల పథకాల అమలు కోసం దళిత గర్జన కార్యక్రమం తలపెడితే పోలీసులతో లాఠీఛార్జి చేయించారన్నారు. గ్రామ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన దళిత సర్పంచిని అవమానించడం దారుణమన్నారు. శనివారం వైస్సార్‌సీపీలో ఉన్న ఆమె మరుసటిరోజే టీడీపీలో చేరిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.