యాప్నగరం

ఈ ఒక్క చేపతో పంట పండింది.. దీని ధర ఎంతో తెలిస్తే, వావ్ అనాల్సిందే!

ఏపీలో ఓ మత్స్యకారుడి పంటపండింది. ఒకే ఒక్క చేప భారీ ధరకు అమ్ముడిపోయి ఔరా అనిపించింది.. ఎంత ధర పలికిందంటే!

Samayam Telugu 11 Jan 2022, 9:42 pm
శ్రీకాకుళం జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. ఒకే ఒక్క చేపతో అతడి కరువు తీరింది. వలలో పడ్డ అరుదైన చేప అతడికి కాసులు కురిపించింది. చూడటానికి సాధారణ చేపలాగే కనిపించినా.. ఊహించని ధర పలికి ఔరా అనిపించింది. కడలి తల్లి అతడి వలకు కాసులు పూయించింది.
Samayam Telugu మత్స్యాకారుడి వలకు చిక్కిన అరుదైన చేప


మత్స్యకారులు ఏడాది పొడవునా చేపల వేటకు వెళ్తుంటారు. రోజూ పట్టే చేపలతో రోజు వారీ జీవనం సాగిపోయేంత డబ్బులు వస్తుంటాయి. ఒక్కోసారి అనుకుండా వారి వలల్లో పడే చేపలు.. 2, 3 నెలలు కష్టపడ్డా తీసుకురానంత డబ్బు తీసుకొస్తుంది. తాజాగా, శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుడి వలకు చిక్కిన చేప అధిక ధరకు అమ్ముడుపోయి.. వావ్ అనిపించింది.

జిల్లాలోని సీహెచ్‌ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లారు. ఆయన వేసిన వలకు సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీంతో తిరుపతిరావు ఆనందపడిపోయాడు. బయటకు వచ్చాక.. ఈ చేపకు వేలంపాట నిర్వహించగా.. వ్యాపారులు రూ. 55,000కు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు. అరుదుగా లభించే ఈ చేపలో ఎక్కువ పోషకాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. దీని వల్లే అధిక ధర పలుకుతుందని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.