యాప్నగరం

ఉరేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్.. ఏపీలో మరో పోలీసు ఆత్మహత్య!

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఎస్సై ఆత్మహత్య ఘటనను మరువక ముందే మరో ఘటన!

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 16 May 2022, 11:51 am
Samayam Telugu ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ సుబ్బారావు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు కార్యాలయం ఆవరణలో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మర్రిపాడు సుబ్బారావు (50) సోమవారం ఉదయం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏఆర్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బారావు సోమవారం ఉదయం విధులకు హాజరై రోల్‌కాల్‌ అనంతరం సమీపంలోని శిథిలావస్థలో ఉన్న భవనంలోకి వెళ్లాడు. అక్కడ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే, మద్యానికి బానిసైన సుబ్బారావు ఈ విషయమై నిత్యం కుటుంబ సభ్యులతో గోడవపడేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం గ్రామంలో మరిడమ్మ సంబరం జరిగింది. సుబ్బారావు అతిగా మద్యం తాగడంతో అతనికి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి గొడవ జరిగిందన్నారు. దీంతో మనస్తాపానికి గురైన సుబ్బారావు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు రాజారావు ప్రస్తుతం ఏఆర్‌ కార్యాలయంలో ఎస్‌టీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన అల్లుడు బాబు నాయుడు కూడా ప్రస్తుతం ఏఆర్‌ కార్యాలయంలో ఆర్‌ఎస్సైగా పని చేస్తున్నారు.
కాగా, ఇటీవలే కాకినాడ జిల్లాలో సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన ఇంట్లోనే సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మిస్‌ ఫైర్‌ జరిగి ఎస్సై మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం, జిల్లా ఎస్పీ వేధింపుల వల్లే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గోపాలకృష్ణకు ట్రైనింగ్ పూర్తయ్యాక కొన్నాళ్లు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించాడు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్‌ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.