యాప్నగరం

శ్రీకాకుళం: క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు వేశాడు.. బ్యాంక్‌కే షాకిచ్చే ప్రయత్నం, ఆ తర్వాత!

Tekkali Bank Fake Currency వ్యవహారం సంచలనంరేపుతోంది. పట్టణంలోని ఓ బ్యాంక్ డిపాజిట్ మెషిన్‌లో ఓ వ్యక్తి డబ్బుల్ని జమ చేశాడు. కానీ వాటిలో దొంగ నోట్లు ఉన్నట్లు తేలింది. మెషిన్ తెరిచిన సమయంలో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారు డిపాజిట్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. గతంలో కూడా టెక్కలి ప్రాంతంలో దొంగ నోట్లు బయటపడిన సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 12 Apr 2023, 9:37 am

ప్రధానాంశాలు:

  • శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఫేక్ కరెన్సీ
  • క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో బయటపడ్డాయి
  • పోలీసులకు ఫిర్యాదు.. ఆరా తీస్తున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tekkali Bank Fake Currency
శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకంరేపుతోంది. టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్‌ మెషీన్‌లో నకిలీనోట్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 29న రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్‌ మెషీన్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాంక్ అకౌంట్‌కు రూ.44వేలు జమ చేశాడు. మొత్తం 88 రూ.500 నోట్లు ఉన్నాయి.. ఇవి ఫేక్‌గా నిర్ధారణ కావడంతో మెషిన్‌లో ఓ పక్కన ఉన్నాయి.
ఈ నెల 3న బ్యాంకు సిబ్బంది ఈ డిపాజిట్‌ మెషీన్‌ తెరవగా.. అందులో నకిలీ నోట్లు చూసి అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని మెనేజర్‌కు చెప్పారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. ఆ తర్వాత టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఈ డబ్బులు ఎవరివ, ఎవరి బ్యాంకు అకౌంట్‌లోకి జమ అయ్యాయో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత క్లారిటీ వస్తుందంటున్నారు.

సాధారణంగా ఒకటో, రెండో దొంగ నోట్లు బయటపడిన ఘటనలు చూసే ఉంటాం. కానీ ఏకంగా రూ.44 వేలు డిపాజిట్‌ చేస్తే.. అన్నీ ఫేక్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ డిపాజిట్ చేసింది ఎవరనేది ఆరా తీస్తున్నారు.. బెట్టింగ్ గ్యాంగ్ పనిగా కూడా అనుమానిస్తున్నారట.
బెట్టింగ్ మాఫియా నకిలీ నోట్లను ఇలా అమాయకులకు అంటగడుతుందేమోననే చర్చ జరుగుతోంది. ఈ నోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఒకవేళ పొరుగున ఉన్న ఒడిశా నుంచి నోట్లు ఏవైనా తీసుకొచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సమగ్రంగా ఆధారాలు లభించిన తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేస్తామని.. ఆ తర్వాతే ఈ నకిలీ నోట్ల వ్యవహారంపై క్లారిటీ వస్తుంది అంటున్నారు.

అంతేకాదు గతంలో కూడా నకిలీ నోట్లు ఇక్కడ బయటపడ్డాయి. ఓ వ్యక్తి టెక్కలి ప్రాంతంలో రూ.2000 నకిలీ నోట్లను ఒక మద్యం షాపు దగ్గర చెలామణీ చేయడం కలకలంరేపింది. అంతేకాదు కొంతమంది వ్యాపారుల దగ్గర నకిలీ నోట్లు బయటపడ్డాయి. దీంతో ఈ వ్యవహారంపై అప్పట్లోనే విచారణ చేశారు. ఇప్పుడు డిపాజిట్ మెషిన్‌లో దొంగ నోట్లు బయటపడటం కంకలంరేపుతోంది. టెక్కలి మాత్రమే కాదు రాష్ట్రంలో ఒకటి రెండు సందర్భాల్లో దొంగ నోట్లు బయటపడ్డాయి.. కానీ టెక్కలిలో మాత్రం వరుసగా ఫేక్ కరెన్సీ బయటపడటం కలకలంరేపుతోంది. ఇలా వరుసగా ఫేక్ కరెన్సీ ఘటనలతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.