కరోనా సమయంలో ఇంట్లో శుభకార్యం చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకుని నిబంధనలు కచ్చితంగా పాటించి తీరాల్సింంది. ఇటీవల చాలామంది ఆ నిబంధనలు అతిక్రమించి చిక్కుల్లో పడిన ఘటనలు చూస్తేనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళంలో ఓ టీచర్ పెళ్లి వేడుకకు ఏకంగా 250 మంది హాజరు కావడంతో పోలీసులు పెళ్లి కొడుక్కి రూ.2లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జిల్లాలో మరో వివాహ వేడుకకు హాజరైన వారికి దిమ్మతిరిగే షాకిచ్చారు పోలీసులు.
నిబంధనలు అతిక్రమించిన నేరానికి పెళ్లి కొడుకు, పెళ్లికూతురు సహా ఫంక్షన్ హాజరైన ప్రతి ఒక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే పెళ్లి వారి కుటుంబానికి జరిమానా విధించాలి గానీ.. అతిథులకు కూడా ఫైన్ వేస్తారా? అంటూ కొందరు పోలీసులకు వాగ్వాదానికి దిగారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతి ఒక్కరూ జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పిన పోలీసులు 30 మంది దగ్గర రూ.వెయ్యి చొప్పున జరిమానా వసూలు చేసుకుని స్టేషన్కు వెళ్లిపోయారు.