యాప్నగరం

మరణించినా మనిద్దరమే అంటూ ప్రేమ జంట ఆత్మహత్య.. తీవ్ర విషాదం

Srikakulam జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మరణించినా మనిద్దరమే అనుకుంటూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Samayam Telugu 27 Oct 2021, 11:13 pm
ఇద్దరిదీ ఒకే గ్రామం.. ఒకరి నొకరు ఇష్టపడ్డారు.. వారి ప్రేమకు పెద్దలు నిరాకరించారు.. దీంతో మనస్తాపం చెందారు.. జీవించినా.. మరణించినా మనిద్దరమే అనుకున్నారు.. అనుకున్న విధంగా మరణంలో కూడా వీరి ప్రేమను విడదీయలేని బంధంగా ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునివాడ గ్రామంలో జరిగింది.
Samayam Telugu శ్రీకాకుళం జిల్లా


శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని రేగిడి మండలం తునివాడ గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను హరీష్‌, దివ్యగా గుర్తించారు.

పెద్దలు తమ ప్రేమకు అంగీకారం తెలపకపోవడంతో హరీష్‌, దివ్య విశాఖపట్నంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ జంట మృతితో తునివాడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.