యాప్నగరం

Srikakulam: భూప్రకంపనలు.. బయటకు పరుగులు తీసిన జనాలు

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం రాత్రి భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్రచలిలో పిల్లపాపలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. గత వారం రోజుల్లో..

Samayam Telugu 5 Jan 2022, 11:56 am
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గంలో స్వల్ప భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. దీంతో ఒక్కసారిగా జనాలు బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్రచలిలో పిల్లపాపలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. గత వారం రోజులలో రెండోసారి ప్రకంపనలు రావడంతో ఆందోళన చెందుతున్నారు.
Samayam Telugu భూప్రకంపనలతో ఇళ్ల బయటే ఉన్న ప్రజలు



మంగళవారం రాత్రి అందరూ ఘాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించింది. ఇచ్చాపురం, కంచిలి, కవిటి ప్రాంతాల పరిధిలోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్‌ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి మూడుసార్లు కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో అర్థకంకాక ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కొందరు భయంతో నిద్ర మానుకుని.. ఇంటి బయటే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.