యాప్నగరం

వీడు కన్నేస్తే ఇళ్లు ఖాళీ, రెక్కీ నిర్వహిస్తే చోరీ పక్కా.. దున్నకృష్ణ మళ్లీ వచ్చాడు !

రాష్ట్రంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేసే దున్నకృష్ణ కదలికలను శ్రీకాకుళం జిల్లా పోలీసులు గుర్తించారు. శ్రీకాకళం జిల్లా మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన దున్నకృష్ణ అలియాస్‌ రాజు ఇప్పటి వరకు 200కు పైగా ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీలోని ఓ ఇంట్లో మూడు రోజుల కిందట చోరీ జరిగింది. ఆ కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. కొన్ని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో దున్నకృష్ణ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 28 Sep 2022, 11:23 am
శ్రీకాకళం జిల్లా మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన దున్నకృష్ణ (Dunna krishna) అలియాస్‌ రాజు మహా మాయగాడు. ఈ కేటుగాడు కన్నెస్తే ఇళ్లు ఖాళీ కావటం కన్ఫామ్. అతడు కనుక స్కెచ్ వేసి రెక్కీ నిర్వహిస్తే చోరీ (theft) పక్కా. ఒకటి కాదు.., రెండు కాదు. ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా ఇళ్లలో అతగాడు చోరీలు చేశాడు. దొంగతనాలకు చేసి పోలీసులకు (Police) పట్టుబడటం, జైలుకు వెళ్లి శిక్ష అనుభవించటం, మళ్లీ బయటకు వచ్చి చోరీలకు పాల్పడటం ఆయనకు అలవాటు. ఏపీలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలోనూ ఆ కేటుగాడు వరుస చోరీలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు. కొన్ని నెలల కిందట శ్రీకాకుళం (Srikakulam) నగరంలోనూ 5 ఇళ్లల్లో రాజు చోరీలకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ ఘనుడి కదలికలను గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు.
Samayam Telugu chori new
దున్న కృష్ణ


శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీలోని ఓ ఇంట్లో మూడు రోజుల కిందట చోరీ జరిగింది. ఆ కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. కొన్ని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో దున్నకృష్ణ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు కృష్ణ ఫొటోలతో కూడిన కరపత్రాలను వివిధ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పోస్టు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని డీఎస్పీ ఎం. మహేంద్ర కోరారు.

దున్నకృష్ణను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. వరుస దొంగతనాల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో గస్తీ పెంచామని వెల్లడించారు. రాత్రిపూట అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇళ్లకు తాళాలు వేసి దూరప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డబ్బు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఊరెళ్లే విషయాన్ని ఇరుగుపొరుగు వారికి కూడా తెలియజేసి తమ ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని వారికి చెప్పాలన్నారు. కాలనీల్లో అనుమానస్పదంగా ఎవరైనా తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.