యాప్నగరం

శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

Srikakulam ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ప్రమాదంలో బాలుడు అనూహ్య రీతిలో మరణించడంతో ఎచ్చెర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Samayam Telugu 20 Oct 2021, 10:25 am
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో విషాదం చోటు చేసుకుంది. ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. మృతిచెందిన విద్యార్థిని మైలపల్లి రాజుగా గుర్తించారు.
Samayam Telugu స్కూల్ బస్సు


మిగతా విద్యార్థులను స్థానికులు రక్షించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం చెరువులో పడ్డ బస్సును జేసీబీ సాయంతో వెలికితీశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తు్నారు.

ఏపీలో పాఠశాల విద్యార్థులు ఆదివారం వరకు దసరా సెలవుల్లో సరదాగా గడిపారు. సోమవారం నుంచే స్కూళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. బడులు మొదలైన మూడో రోజే బస్సు ప్రమాదంలో బాలుడు అనూహ్య రీతిలో మరణించడంతో ఎచ్చెర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.