యాప్నగరం

హిందీ పేపర్ లీకైందంటూ వైరల్.. అధికారులు క్లారిటీ

శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకైందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. వెంటనే విచారణ చేపట్టారు. దుష్పచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 28 Apr 2022, 1:46 pm
ఏపీలో వరుసగా టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీ వార్తలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో బుధవారం తెలుగు పేపర్ మాల్‌ప్రాక్టీస్ ఘటన మరువముందే.. శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకైందంటూ వార్తలు గుప్పుమన్నాయి. సరుబుజ్జిలి మండలం రొట్టవలస షలంత్రి పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే.. ఓ క్వశ్చన్ పేపర్ వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Samayam Telugu శ్రీకాకుళం జిల్లాలో పదోతరగతి పేపర్ లీకైనట్లు వదంతులు


ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టారు. పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ల ఫోన్లు తనిఖీ చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరలేదని సమాచారం. మరోచోట బయటకు వచ్చినవి.. ఇక్కడ వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు తెలిపారు.

ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ విచారణకు ఆదేశించారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కాలేదని స్పష్టంచేశారు. దుష్పచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.