యాప్నగరం

మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీకి షాక్.. పోలీసులు బలవంతంగా..

Srikakulam ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. టీడీపీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యం మీద మచ్చ వంటిదని అన్నారు. పోలీసులు ఆయనను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Samayam Telugu 20 Oct 2021, 8:07 am
మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలపై దాడి చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ ఆయన టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన నిర్వహించారు.
Samayam Telugu ఎంపీ రామ్మోహన్ నాయుడు


టీడీపీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యం మీద మచ్చ వంటిదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇదొక బ్లాక్ డే అని ఇటువంటి ఘటనలపై ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరుగుతున్నా పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఈ ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్ చేశారు. న్యాయం కోసం వెళితే తిరిగి తమపైనే కేసులు పెట్టడం ప్రభుత్వానికి, పోలీసులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఎంపీని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా తీసుకెళ్లి కారులో తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.