యాప్నగరం

శ్రీకాకుళం: పిల్లలకు చదువు చెప్పాల్సిన హెడ్మాస్టరే.. దిమ్మతిరిగే షాకిచ్చిన తల్లిదండ్రులు!

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ తల్లిదండ్రులు దాడి చేశారు.

Samayam Telugu 6 Mar 2021, 5:07 pm
పాఠశాలను ముందుండి నడిపిస్తూ, పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే పెడదారి పట్టారు. తన వద్ద చదివే ఆడపిల్లలతో అసభ్యకరంగా మాట్లాడుతూ, చివరికి తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తిన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో శనివారం చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీ కృష్ణ తమతో అసభ్యంగా మాట్లాడుతున్నాడంటూ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu హెడ్మాస్టర్‌ను నిలదీస్తున్న గ్రామస్తులు


దీంతో శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని చితకబాదారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా మార్పు రాలేదని.. అందుకే దేహశుద్ధి చేశామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి హెచ్ఎంను చూడలేదని, చదువు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే ఇలా చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఎంను విద్యార్థినుల తల్లిదండ్రులు చితకబాదిన అనంతరం.. పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.