యాప్నగరం

శ్రీకాకుళం: వీళ్లకు ఆకలేస్తే చీమలు తింటారు.. ఎందుకంటే!

Srikakulam Tribal Ant Chutney శ్రీకాకుళం జిల్లా గిరిజనలు చీమల్ని తినడం అలవాటు. చట్నీతో పాటూ వివిధ రకాల వంటకాలు చేసుకుని తింటారు. వీరు చీమల్ని వండేసి జీలుగు కల్లుతో కలిసి తింటారు. ఆ టేస్టే వేరు అంటూ లొట్టలేస్తారు. అయితే ఇలా చీమల్ని తినడం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు. ఇలా చీమల తినకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అంటున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 10 Jun 2023, 1:28 pm

ప్రధానాంశాలు:

  • గిరిజనుల విచిత్రమైన ఆహారం
  • చీమల్ని తినడం వీళ్లకు అలవాటు
  • మంచి అలావటు కాదన్న డాక్టర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Srikakulam Tribes Ants Food
ఎవరికైనా ఆకలేస్తే ఏం చేస్తారు.. ఇదేం ప్రశ్న అని షాకవ్వకండి. ఆకలేస్తే అన్నం తింటాం.. లేకపోతే నచ్చిన ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటాం. కానీ వీళ్లు మాత్రం అలా కాదు.. ఆకలేస్తే చీమలను తింటారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ.. నిజమండీ బాబూ. ఇదంతా ఎక్కడో విదేశాల్లో అనుకుంటే మీరు తప్పులో కాలిసినట్లే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోనే. గిరిజన ప్రాంతంలో ఉన్న సీతం పేట, పాలకొండ గిరిజనులు చీమలనే ఆహారంగా తింటారు. వీరు ఉదయాన్నే లేచి సమీపంలో వున్న తోటలకి, కొండలపైకి వెళ్తారు.
పుట్టలు, ఇతర చీమలు ఉండే ప్రాంతాలను వెతుకుతారు. ఎంచక్కా చీమల గుంపు కనిపించగానే వాటిని తమ సంచులలోకి తీసుకుంటారు. ఆ చీమలను రకరకాల కర్రీ లుగా ,చీమల చట్నీ చేసుకుని తినడం అలవాటు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చాలామంది గిరిజనులకు ఇది అలవాటుగా ఉంది. చీమల కర్రీ, జీలుగు కల్లు ఉంటే ఆ టేస్టే వేరని గిరిజనులు అంటున్నారు. వీరంతా సమీపంలోని కొండల్లోకి వెళ్ళాక అక్కడ చీమల గుంపును ఇట్టు పట్టేస్తారు.

చీమల వంటకాలతో పాటూ మద్యాన్ని సిద్ధం చేసి విందుకు రెడీ అవుతారు. ఇలా తినడం తమకు ఎంతో ఇష్టమని, వేడిచేసిన చీమలు రుచే వేరుగా ఉంటుందని అంటున్నారు గిరిజనులు. వీరి అలవాటు దెబ్బకు ఇక్కడ చీమల జాతి అంతరించుకుపోతోందని కొందరు చమత్కరిస్తున్నారు. వీరు ఇలా చీమలను తినడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదమని వైద్యులు అంటున్నారు. జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయని.. ఇలాంటి ఆహారపు అలవాట్లు మంచిదికాదంటున్నారు. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు గిరిజనుల్లో చైతన్యం కలిగించాలని కోరుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఉన్న మూఢనమ్మకాలు, వారి ఆహారపు అలవాట్లు చిక్కులు వస్తాయంటున్నారు. వీరు నిత్యం ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో ఇక్కడి గిరిజనులు బాధపడుతుంటారు. ఈ దిశగా వీరిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటూ స్వచ్చంద సంస్థలపైన కూడా ఉంది. మొత్తానికి ఈ చీమల ఆహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.